కంపెనీ మార్కెట్ప్లేస్ హెడ్ అనిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
గ్రాసరీ విభాగంలోకి ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రీ–ఎంట్రీ ఇవ్వబోతోంది. బెంగళూరు, హైదరాబాద్తోపాటు పలు నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సేవలను పరీక్షిస్తోంది. ఆగస్టులో ఈ సేవలను ఆవిష్కరించే చాన్స్ ఉంది. గ్రాసరీ కోసం ప్రత్యేకంగా నియర్బై పేరుతో ఫ్లిప్కార్ట్ 2015 అక్టోబరులో యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, సౌందర్య సాధనాలను సూపర్ మార్కెట్ల నుంచి సేకరించి కస్టమర్లకు డెలివరీ చేసేది.
వినియోగదార్ల నుంచి స్పందన అంతంతే ఉండటంతో కొన్ని నెలల్లోనే నియర్బై యాప్కు స్వస్తి పలికింది. రూ.3,900 కోట్ల ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ విపణిలో పోటీ కంపెనీ గతేడాది అమెజాన్ నౌ పేరుతో ప్రవేశించింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సైతం తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. కొన్ని నెలల్లోనే ఈ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్కార్ట్ మార్కెట్ప్లేస్ హెడ్ అనిల్ గోటేటి మంగళవారమిక్కడ తెలిపారు. కంపెనీ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గ్రాసరీ రంగంలో విభిన్న తరహాలో సేవలు అందించేందుకు సిద్ధం అవుతున్నట్టు చెప్పారు.
ధరలు తగ్గుతాయి..: జీఎస్టీ రాకతో రానున్న రోజుల్లో రవాణా ఖర్చులతోపాటు ఉత్పత్తుల అంతిమ ధర కూడా తగ్గుతుందని అనిల్ వెల్లడించారు. జీఎస్టీ పూర్తి స్థాయిలో అమలైతే ఇది సాధ్యమని అన్నారు. నూతన పన్ను విధానంపై విక్రేతలకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. జూలై 1 తర్వాత అమ్మకాలు తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్కార్ట్ కస్టమర్ల సంఖ్య 10 కోట్లపైనే. దీనిని 50 కోట్ల స్థాయికి చేర్చేందుకు అంతర్గతంగా లక్ష్యాన్ని విధించుకున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 28 లక్షల మంది వినియోగదార్లు ఉన్నట్టు చెప్పారు. కంపెనీ అమ్మకాల పరంగా టాప్–6 నగరాల్లో హైదరాబాద్ నిలిచింది.
గ్రాసరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్ రీ–ఎంట్రీ
Published Wed, Jul 19 2017 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement