
వీకో ల్యాబ్స్ డైరెక్టర్కి అవార్డు
వీకో ల్యాబొరేటరీస్ డైరెక్టర్ సంజీవ్ పెండార్కర్ను ‘మరాఠి ఉద్యోగ్ భూషన్’ అవార్డు వరించింది.
హైదరాబాద్: వీకో ల్యాబొరేటరీస్ డైరె క్టర్ సంజీవ్ పెండార్కర్ను ‘మరాఠి ఉద్యోగ్ భూషన్’ అవార్డు వరించింది. ఇటీవల ముంబైలో జరిగిన మరాఠి వ్యవసాయిక్ ఉద్యోజక్ వ్యాపారి మిత్రమండల్ 36వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈయన ఈ అవార్డును తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర పరిశ్రమలు, మైనింగ్ శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.