రూ.999కే ఎయిర్‌ఏషియా టికెట్‌ | Sakshi
Sakshi News home page

రూ.999కే ఎయిర్‌ఏషియా టికెట్‌

Published Tue, Jul 10 2018 12:34 AM

AirAsia India offers flight tickets from Rs 999 in new sale - Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘ఎయిర్‌ఏషియా’తాజాగా ‘లో ఫేర్‌ మ్యాడ్‌నెస్‌’ పేరుతో ప్రత్యేకమైన ప్రమోషనల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.999 ప్రారంభ ధరతో దేశీ విమాన టికెట్లను అందిస్తోంది. జూలై 15 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు 2019 ఫిబ్రవరి 1 నుంచి 2019 ఆగస్ట్‌ 13 వరకు మధ్య ఎప్పుడైనా ప్రయాణిం చొచ్చని కంపెనీ తెలిపింది.airasia.com  ద్వారా చేసుకునే బుకింగ్స్‌కు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుంది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు రూ.1,699 ప్రారంభ ధరగా పేర్కొంది.  

Advertisement
Advertisement