♦ రిటైల్ ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మొగ్గు
♦ ఆ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్ వైపు చూపు
♦ కరెక్షన్ కోసం చూస్తున్న 65 శాతం మంది
♦ డెరివేటివ్స్, డే ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ
♦ జియోజిత్ సర్వేలో ఇన్వెస్టర్ల వెల్లడి
ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తొలి చాయిస్ షేర్లే. ఇతర పెట్టుబడి సాధనాల కంటే షేర్లకే వారు తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ జియోజిత్ సెక్యూరిటీస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మిగులు నగదు ఉన్నప్పుడే తాము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటామని ఎక్కువమంది స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అవగాహన కోసం సెబీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలితాలివ్వటం మొదలెట్టాయని, దలాల్ స్ట్రీట్ను ఇవి చక్కని పనితీరుగల మార్కెట్గా మార్చాయని సర్వే ప్రశంసించింది. నిఫ్టీ, సెన్సెక్స్ ఈ ఏడాది 18 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. సెన్సెక్స్ ఇటీవల 30,000 మార్కును దాటడంతో కోచికి చెందిన జియోజిత్ సెక్యూరిటీస్ ఆన్లైన్ వేదికగా 3 లక్షల మంది ఇన్వెస్టర్లతో సర్వే నిర్వహించింది.
కాగా సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది తమ మిగులు ఆదాయంలో 20 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నిజానికి దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలను ఆర్జించినట్టు చూపే గణాంకాలు అందుబాటులో లేవు. ఎందుకంటే వీరు మార్కెట్ల బూమ్లో ఉన్నపుడు ప్రవేశించడం, కరెక్షన్కు గురవగానే నష్టాలతో బయటకు వెళ్లిపోవడం జరుగుతుంటుంది.
సర్వేలో వెల్లడైన అంశాలివీ...
⇔ నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాం: 83.45 శాతం
⇔ మిగులు నిధులున్నపుడే స్టాక్ మార్కెట్లో పెడతాం: 59.25 శాతం
⇔ నెలనెలా ఇన్వెస్ట్ చేస్తాం: 20 శాతం
⇔ కొంత మొత్తాన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం: 57.21 శాతం
⇔ నేరుగా ఈక్విటీల్లో పెడితేనే మంచి రాబడులొస్తాయి: 65.5 శాతం
⇔ ఈక్విటీల్లో రిస్కుంటుంది కనక మ్యూచువల్ ఫండ్లే నయం: 24 శాతం
⇔ డెరివేటివ్స్ అంటే అధిక రిస్కుంటుంది. కాబట్టి దాన్లో పెట్టం: 20 శాతం
⇔ కాస్తంత రిస్క్ ఉన్నా డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం: 4.76 శాతం
⇔ డే ట్రేడింగ్ అంటే చాలా రిస్కుంటుంది. కాబట్టి మేం దూరంగా ఉంటాం: 62%
⇔ లాభం వెనక నష్టం కూడా ఉంటుంది. అయినా డే ట్రేడింగ్ చేస్తాం: 14.55%
⇔ మార్కెట్లలో కరెక్షన్ వస్తే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తాం. వేచి చూస్తున్నాం: 65%
షేర్లంటే మాకెంతో ఇష్టం!
Published Thu, Jul 20 2017 12:13 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
తప్పక చదవండి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
Advertisement