వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా శేఖర్‌గౌడ్ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా శేఖర్‌గౌడ్

Published Thu, Jan 9 2014 12:22 AM

వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా శేఖర్‌గౌడ్ - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఈసీ శేఖర్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కా ర్యాలయం తెలిపింది. ప్రస్తుతంఇబ్రహీంపట్నం నియోజకవర్గం సమన్వయకర్తగా శేఖర్‌గౌడ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే దిశగా కార్యాచర ణ ప్రణాళికను రూపొందిస్తానని శేఖర్‌గౌడ్ ఈ సందర్భంగా ‘సాక్షి’కి తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

Advertisement
Advertisement