సత్యనిష్ఠ, సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్‌ : వైఎస్‌ జగన్‌

YS Jagan greets Muslims on Ramadan - Sakshi

ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం శుభాకాంక్షలు 

సాక్షి, అమరావతి: రంజాన్‌ పర్వదినం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్‌ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్‌ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్‌’ అని తెలిపారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్‌ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆత్మీయ శుభాభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top