వైఎస్‌ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం | YS Jagan Gets TTD Priests Blessings At His Home | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం

May 30 2019 11:22 AM | Updated on May 30 2019 4:24 PM

YS Jagan Gets TTD Priests Blessings At His Home - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్న టీటీడీ ఈవో సింఘాల్‌, అర్చకులు వైఎస్‌ జగన్‌కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే వైఎస్‌ జగన్‌ సర్వమత ప్రార్థనల్లో పాల్గొననున్నారు. మరికాసేపట్లో వైఎస్‌ జగన్‌ తన నివాసం నుంచి ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి బయలుదేరనున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో విజయవాడలో పండగ వాతావరణం నెలకొంది.

వైఎస్‌ జగన్‌కు స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు..
వైఎస్‌ జగన్‌ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు స్వామికి ఫోన్‌ చేసిన జగన్‌ ఆయన ఆశీస్సులు కోరారు. దీంతో ఆయన వైఎస్‌ జగన్‌కు ఆశీస్సులు అందజేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement