అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు సిగ్గుగా లేదా? | YS Jagan Condemns Lathicharge On Anganwadi Workers In Vizianagaram | Sakshi
Sakshi News home page

మహిళలపై దాడి చేయడం అమానుషం: వైఎస్‌ జగన్‌

Apr 25 2018 2:25 AM | Updated on Sep 19 2018 8:32 PM

YS Jagan Condemns Lathicharge On Anganwadi Workers In Vizianagaram - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ వర్కర్లకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో వేతనాలను పెంచనందుకు సిగ్గుగా లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

విజయనగరంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీ వర్కర్లపై లాఠీచార్జి చేయడాన్ని మంగళవారం వైఎస్‌ జగన్‌ ట్వీటర్‌లో తీవ్రంగా ఖండించారు. ‘తమ హక్కుల సాధన కోసం విజయనగరంలో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లపై జరిగిన పాశవికమైన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబూ.. మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. మళ్లీ వారిపై తీవ్ర అణచివేత చర్యలకు ఒడిగడతారు. తెలంగాణలో మాదిరిగా అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు మీకు సిగ్గుగా లేదా?’అని జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement