వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిరాడంబరంగా జరిగింది.
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు
ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ‘జై సమైక్యాంధ్రప్రదేశ్’ నినాదంతో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వందలాది మంది యువకులు, విద్యార్థులు రక్తదానం చేశారు. ఐటీ విభాగం ఆధ్వర్యంలో ‘చీర్స్’ ఫౌండేషన్కు చెందిన 22 మంది అనాథ విద్యార్థులకు రూ.2500 చొప్పున పంపిణీ చేశారు. పిల్లలకు ఈ చెక్కులను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి అందజేశారు. తన జన్మదినోత్సవాన్ని ఎవరూ ఆర్భాటంగా నిర్వహించవద్దని జగన్ కోరటంతో పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని మైసూరా తెలిపారు. అంతకుముందు కార్యాలయం ప్రాంగణంలో యువజన విభాగం ఆధ్వర్యంలో కేక్ కోసి అందరికీ పంచి పెట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, బి.జనక్ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్రావు, పుత్తా ప్రతాప్రెడ్డి, కె.శివకుమార్, మేడపాటి వెంకట్, బాజిరెడ్డి గోవర్ధన్ సహా పెద్దసంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో జగన్..: వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడిపారు.
జగన్కు మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ శుభాకాంక్షలు
జగన్ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఏపీ భవన్లో జగన్ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా నిర్వహించారు. మన్యసీమ ఉద్యమనేత, ఖమ్మం జిల్లా వైఎస్సార్ సీపీ నాయకుడు చందా లింగయ్యదొర ఆధ్వర్యంలో తెలుగువారు కేక్ కోశారు.