
చాగలమర్రి, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ రూరల్: ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి నుంచి మంగళవారం 8:30 గంటలకు ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. స్థానిక ఎస్ఎస్ ధాబా నుంచి ముత్యాలపాడు బస్టాండ్ వరకు మండల నాయ కుడు బాబులాల్ ఆధ్వర్యంలో దారిపొడవునా పూలబాట వేసి జననేత వైస్.జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగం పలికారు. మండల నాయకులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు, కులసంఘాల నాయకులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను విన్నమించారు. జగన్నను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. జననేతను చూడటానికి మిద్దెలు, చెట్లు ఎక్కారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గంగుల నాని, గంగుల సుభాష్రెడ్డి, మనోహర్రెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు, బాచాపురం రాఘవేంద్రారెడ్డి, లడ్డుబాయ్, సుధాకర్రెడ్డి, గంధం రాఘవరెడ్డి, ఎస్ భరత్కుమార్, గుండామణి, యాదవాడ నరసింహారెడ్డి, నర్సపురం సర్పంచ్ ప్రసాద్రెడ్డి, గజ్జల క్రిష్ణారెడ్డి, చాగలమర్రి మండల నాయకులు బాబులాల్, వీరభద్రుడు, వెంకటరమణ, ముల్లా రఫీ, షబ్బీర్, హుసేన్వలి, గేట్లమాబు, అబ్దుల్లాబాషా, మాబుషరీఫ్, వలిసాగారి షరీఫ్,పెయింటర్ రఫి, మనోహర్, రామనారాయణరెడ్డి, బలస్వామి, పత్తి నారాయణ, సంజీవరాయుడు, తులసి, రామకృష్ణ, రవి, శ్రీధర్, మురళి, వీరారెడ్డి, శేషు రమేష్, చాంద్బాషా, కానాల మాబుబాషా, గోవిందమ్మ, బాజోజి, శ్రీనివాసులు, గిరిరాజు, రవి, నాగయ్య పాల్గొన్నారు.
చాగలమర్రి: ప్రజాసంకల్ప యాత్రకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మండల నాయకుడు బాబులాల్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యుడు మాబుషరీఫ్ మంగళవారం గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ గంగల ప్రభాకర్రెడ్డి పెద్దమకానంలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాత్రలో చాగలమర్రి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జగన్ వెంట నడిచారు.