281వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 281st Day PrajaSankalpaYatra Begins | Sakshi
Sakshi News home page

Oct 8 2018 8:22 AM | Updated on Oct 9 2018 7:48 AM

YS Jagan 281st Day PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, చీపురుపల్లి :  రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. సోమవారం ఉదయం జననేత 281వ రోజు పాదయాత్రను గుర్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్‌, అనందపురం క్రాస్‌ మీదుగా గరికవలస వరకూ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. గరిక వలసలో వైఎస్‌ జగన్‌ ప్రజలతో మమేకమవుతారు. 

జననేత వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement