293వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan 293 Day Prajasankalpayatra Schedule Released - Sakshi

సాక్షి, సాలూరు: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 293వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం జననేత నైట్ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సన్యాసిరాజుపేట, బాగువలస మీదుగా  నక్కడవలస క్రాస్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతుంది.  అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తడిలోవ, మక్కువ మండలంలోని గునికొండవలస మీదుగా చప్ప బుచ్చంపేట వరకు జననేత పాదయాత్ర సాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన 292వ రోజు పాదయాత్ర
వైఎస్‌ జగన్‌ 292వ రోజు పాదయాత్ర సన్యాసిరాజుపేట వద్ద ముగిసింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పురస్కరించుకుని మంగళవారం పాదయాత్ర మధ్యాహ్నం వరకే కొనసాగింది. ఈ ఉత్సవంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనేందుకు వీలుగా జననేత ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేడు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సీతమ్మదొరపాలెం క్రాస్‌ రోడ్డు, చంద్రప్పవలస క్రాస్‌ రోడ్డు, దేవబుచ్చమ్మ పేట, వల్లాపురం మీదుగా సన్యాసిరాజుపేట వరకు 6 కిలోమీటర్లు సాగింది. జననేత ఇప్పటివరకు మొత్తంగా 3,199.6 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top