రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Sep 2 2013 4:41 AM | Updated on Aug 30 2018 3:56 PM

మండలంలోని పారాది గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

బొబ్బిలి టౌన్, న్యూస్‌లైన్ : మండలంలోని పారాది గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామభద్రపురం మండలం ఆరికతోటకు చెందిన ఆకుల విజయమ్మ(40), ఆమె కుమారుడు కిరణ్‌కుమార్, పల్లా రాము, సాయికుమార్, గాడి వెంకటరావులు రెండు ద్విచక్ర వాహనాలపై పట్టణ పరిధిలోని ఐటీఐ కాలనీలో ఓ శుభకార్యానికి వచ్చారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కార్యక్రమం అనంతరం ఆరికతోటకు తిరుగు ప్రయాణమయ్యారు. పారాది వద్ద ఆగి ఉన్న లారీని వీరు బలంగా ఢీకొన్నారు. ఈ ఘటనలో ఐదుగురూ తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు వారిని 108 వాహన సహాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
 అక్కడ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో విజయమ్మ మృతి చెందింది. మృతురాలు విజయమ్మ కుమారుడు కిరణ్‌కుమార్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. మరో ముగ్గురికీ చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు వీరికి ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు. పారాది వద్ద టైర్ పంక్చర్ కావడంతో లారీ నిలిచిపోయిందని, మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న వారు అదుపు చేయలేక ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement