అప్పు చెల్లించలేదని మహిళను నిర్బంధించిన వ్యాపారి | Woman house arrest in tirumala | Sakshi
Sakshi News home page

అప్పు చెల్లించలేదని మహిళను నిర్బంధించిన వ్యాపారి

Dec 1 2013 9:06 AM | Updated on Sep 2 2017 1:10 AM

ఓ మహిళ రుణం తీసుకున్నందుకు దాదాపు నాలుగు నెలల పాటు ఆమెను నిర్బంధించాడు ఓ వడ్డి వ్యాపారి.

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని కస్తురి అనే మహిళను రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ దాదాపు ఐదు నెలలపాటు గృహ నిర్బంధించాడు. దాంతో స్థానికులు, మీడియా సహాయంతో ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను గృహ నిర్బంధం నుంచి రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.

 

పోలీసుల కథనం ప్రకారం... గతంలో కస్తురి అనే మహిళ రియల్ వ్యాపారి ప్రసాద్ వద్ద రూ. 4 లక్షల అప్పు చేసింది. ఆ అప్పు చెల్లించడంలేందంటూ గత ఐదు నెలల క్రితం ప్రసాద్ ఆమెను తన గృహంలో నిర్బంధించాడు. తనను విడుదల చేయాలని కస్తురి ఎన్నిసార్లు ప్రాదేయపడిన ప్రసాద్ కనికరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ విషయం స్థానికులకు తెలియడంతో మీడియాకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్ట్ చేశారు. కస్తురి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement