
ప్రారంభమైన విరసం సాహిత్య పాఠశాల
బొబ్బిలిలో రెండు రోజుల పాటు జరగనున్న విరసం(విప్లవ రచయితల సంఘం) సాహిత్య పాఠశాల కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి.
బొబ్బిలి(విజయనగరం): బొబ్బిలిలో రెండు రోజుల పాటు జరగనున్న విరసం(విప్లవ రచయితల సంఘం) సాహిత్య పాఠశాల కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థూపాన్ని, విరసం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు, కాలీపట్టణం రామారావు, కాకరాల, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి, విరసం కళాకారులు ప్రజాగీతాలను ఆలపించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో కళాకారులు హజరవుతున్నారు.