టైఫాయిడ్‌తో బాలుడు మృతి | Sakshi
Sakshi News home page

టైఫాయిడ్‌తో బాలుడు మృతి

Published Sun, Aug 30 2015 3:24 PM

typhoid fever kills toddler in guntur district

గుంటూరు: టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మృతిచెందాడు. వివరాలు.. గుంటూరు జిల్లాలోని ఈపూరు మండలకేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన మణికంఠ(7) అనే బాలుడు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాదపడుతుండటంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement