ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వంగపాడు వద్ద మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీ కొట్టింది.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వంగపాడు వద్ద మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనలో మరణించిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.