ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో మంగళవారం విషాదం నెలకొంది.
కరెంటుషాక్తో ఇద్దరు రైతులు మృతి
Jan 26 2016 12:57 PM | Updated on Jun 4 2019 5:16 PM
పెద్దారవీడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో మంగళవారం విషాదం నెలకొంది. పొలంలో పైపులు నేలలో తవ్వి వేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎర్త్ వైరు తగిలి ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గొబ్బూరు గ్రామానికి చెందిన దొండపాటి అనిల్(35), వెన్నా నాగిరెడ్డి(40)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


