ఇద్దరు గల్లంతు | Two displaced | Sakshi
Sakshi News home page

ఇద్దరు గల్లంతు

Oct 25 2013 1:05 AM | Updated on Sep 1 2017 11:56 PM

వర్షాలకు జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు ధ్రువీకరించారు. తాచేరు నదిలో పడి గురువారం సాయంత్రం మహిళ కనిపిం చకుండాపోయింది.

మాడుగుల, న్యూస్‌లైన్:  వర్షాలకు జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు ధ్రువీకరించారు. తాచేరు నదిలో పడి గురువారం సాయంత్రం మహిళ కనిపిం చకుండాపోయింది. ఎం.కోడూరు గ్రామానికి చెందిన జాజిమొగ్గల ఆదిలక్ష్మి (35) నది ఒడ్డుకు బహిర్భూమికి వెళ్లింది. నీటి ఉధృతికి గల్లంతయింది. ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్నితహశీల్దార్ పి.రామునాయుడు పరిశీలించారు. కాగా విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టర్-2లోని చాకలిగెడ్డలో బంగారమ్మ(70) కొట్టుకుపోయింది.  
 
మరుపాకలో నీట మునిగి ఒకరు...

 రావికమతం : మరుపాకలో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. గురువారం సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తున్న దాలిబోయిన సన్నిబాబు(58) గెడ్డదాటబోయి అందులో మునిగిపోయాడు. అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఆయాసంతో ఇంటికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందాడు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement