యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్ | twist in acid attack case in krishna district | Sakshi
Sakshi News home page

యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్

Jun 29 2015 9:13 AM | Updated on Aug 17 2018 2:10 PM

యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్ - Sakshi

యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు మిస్టరీ వీడింది. మృతురాలే దాడి చేయిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

గన్నవరం: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు మిస్టరీ వీడింది. మృతురాలే దాడి చేయిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన ప్రియుడిపై దాడి చేయాలకున్న ఆమె ప్రయత్నం బెడిసి కొట్టడంతో రాణి ప్రాణాలు పోగొట్టుకుంది. తనతో సహజీవనం చేస్తున్న కఠారి రాజేష్ కు పెళ్లి కుదరడంతో అతడిపై యాసిడ్ చేసేందుకు ఇద్దరు యువకులతో రాణి ఒప్పందం కుదుర్చుకుంది.

ప్లాన్ లో భాగంగానే కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో బుడమేరు వంతెన వద్ద శుక్రవారం రాత్రి రాజేష్, రాణిపై యాసిడ్ దాడి జరిగింది. అయితే దాడి సమయంలో రాణి బైకు పైనుంచి కింద పడిపోడంతో తలకు గాయమై ఆస్పత్రిలో మృతి చెందింది. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో కేసు మిస్టరీ వీడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement