అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్‌ | TTD Chairman YV Subba Reddy Visits Kanaka Durga Temple | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్‌

Dec 21 2019 2:31 PM | Updated on Dec 21 2019 2:36 PM

TTD Chairman YV Subba Reddy Visits Kanaka Durga Temple - Sakshi

సాక్షి, విజయవాడ : టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మంచి జరగాలని ప్రార్థించానన్నారు. మూడు ప్రాంతాలలో రాజధాని రావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీటీడీలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం అందేవిధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న పద్దతులను ప్రక్షాళన చేసి కొత్త పద్దతులను ప్రారంభిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement