గోదావరి పుష్కరపనుల్లో కాసులవేటకే ప్రాధాన్యమిచ్చి, భక్తుల ప్రాణాలను ప్రభుత్వం బలిగొందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మం డలి
సాలూరు: గోదావరి పుష్కరపనుల్లో కాసులవేటకే ప్రాధాన్యమిచ్చి, భక్తుల ప్రాణాలను ప్రభుత్వం బలిగొందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మం డలి సభ్యుడు రాజన్నదొర మండిపడ్డారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల ప్రారంభ సమయంలోనే ఏర్పాట్లలో వైఫల్యం కార ణంగా ఇంతమంది భక్తులు దుర్మరణం చెందారని ఆవేదన వెలిబుచ్చారు. ఈవిషాద ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పుష్కర పనులు మొదలైన నాటి నుంచి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, వెయ్యి కోట్ల రూపాయలవరకు అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినవస్తున్నాయన్నారు.
పనుల్లో అవకతవకలు చేసి కాసులు వెనకేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రణాళిక లేకుండా పుష్కరాలను ప్రారంభించారన్నారు. కుంభమేళాలో కూడా ఇంతటి విషాదం జరగలేదన్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, అన్ని ఘాట్లకు భక్తులు వెళ్లేలా చేయకపోవడం, తాగునీటిని కూడా అందించలేకపోవడం వంటి తప్పిదాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. పుష్కర తేదీని నిర్ణయించడంలో కూడా తీవ్ర గందరగోళం నెలకొనేలా ప్రభుత్వం వ్యవహరిం చిందని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందన్నారు.
ఇకపై పుష్కరాలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవడమే కాకుండా మళ్లీ ఇలాంటి విషాదకర ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ నాగార్జున పాల్గొన్నారు.