జిల్లాలో ఈ నెల 7, 8 తేదీల్లో మంత్రులు పర్యటించనున్నారు. కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప, ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరరావుతో పాటు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరరావు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పీతల సుజాత, కేంద్ర సైన్స్అండ్ టెక్నాలజీ మంత్రి వైఎస్చౌదరి జిల్లాలో పర్యటించను
కేంద్రమంత్రులు వెంకయ్య, వైఎస్ చౌదరి కూడా..
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో ఈ నెల 7, 8 తేదీల్లో మంత్రులు పర్యటించనున్నారు. కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప, ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరరావుతో పాటు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరరావు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పీతల సుజాత, కేంద్ర సైన్స్అండ్ టెక్నాలజీ మంత్రి వైఎస్చౌదరి జిల్లాలో పర్యటించనున్నారు.
పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 7న ఉదయం 10.30 గంటలకు సోమశిల రాజ్వరాయర్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మంత్రులతో కలసి పాల్గొంటారు. మంత్రుల పర్యటనలో ప్రొటోకాల్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జానకి సంబంధిత అధికారులను ఆదేశించారు.
విగ్రహాల ఆవిష్కరణ రద్దు
కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు 7న కావలిలో ఛత్రపతి శివాజీ, 8న ఆత్మకూరులో తిరుపతినాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ జానకి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.