నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా | Today MLA sunilkumar Protest | Sakshi
Sakshi News home page

నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా

Nov 6 2014 4:18 AM | Updated on Feb 17 2020 5:16 PM

నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా - Sakshi

నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా

అక్రమ కేసు నమోదును నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంట లకు ధర్నా చేయనున్నట్లు పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు.

యాదమరి : అక్రమ కేసు నమోదును నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంట లకు ధర్నా చేయనున్నట్లు పూతలపట్టు  శాసనసభ్యుడు డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు.  బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదమరి మండలం మోర్థనపల్లె  సబ్‌స్టేషన్‌లో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ అకారణంగా  తమను తొలగించారని  అక్కడ విధులు నిర్వహిస్తున్న మొగలీష్, సతీష్, భాగ్యరాజ్  తెలియజేశారని తెలిపారు.

వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో సోమవారం సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లాలని, ఆ సమయంలో అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ తప్ప  అధికారులెవ్వరూ లేరని తెలి పారు.  రికార్డులను పరిశీలిం చి ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని అడిగానే తప్ప మరేమీ మాట్లాడలేదన్నారు. దీనిపై అదేరోజు ఆ గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన టీడీపీ నాయకులు రాద్ధాం తం చేశారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలు చేసి కేసు నమోదు చేరుుంచారని ఆరోపించా రు. మాజీ ఎంపీపీ ధనంజయులురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహరన్ మాట్లాడుతూ ధర్నా కార్య క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement