ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం | three students disappear in vijayawada | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం

Sep 6 2017 8:31 AM | Updated on Sep 12 2017 2:04 AM

తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు.

విజయవాడ: ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం నగరంలో కలకలం రేపుతోంది. నగర శివారులోని నున్న ప్రాంతంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు నిన్న(మంగళవారం) పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు.

స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఉప్పుతల శరణువల్లి(15), ఆది వైష్ణవి(14), అత్తులూరి నాగ సంజన(14)లు మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన వీరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement