అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని 44వ జాతీయ రహదారి సోమెండపల్లి- గోరెంట్ల మధ్య ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రామేశ్వరం నుంచి కర్నూలు వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.