విశాఖ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం | Thieves gang Robbery in Vizag | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

Mar 26 2017 11:40 AM | Updated on Aug 30 2018 5:27 PM

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని శారదానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

విశాఖపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలోని శారదానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఇంట్లో కత్తులతో ప్రవేశించిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లో ఉన్నకాడికి దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో 15 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ. 10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement