ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు. ఈ నెల 11న వీరిద్దరూ భేటీకానున్నారు. శాఖల విభజన, కార్పొరేషన్ల విభజన, ఉమ్మడి సంస్థల విభజన తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చర్చిస్తారు.