'జెడ్పీటీసీ బంధువులను ప్రలోభపెడుతున్న టీడీపీ' | TDP Trying to Attract YSRCP ZPTC Kin | Sakshi
Sakshi News home page

'జెడ్పీటీసీ బంధువులను ప్రలోభపెడుతున్న టీడీపీ'

Jul 4 2014 9:25 PM | Updated on Oct 20 2018 6:04 PM

'జెడ్పీటీసీ బంధువులను ప్రలోభపెడుతున్న టీడీపీ' - Sakshi

'జెడ్పీటీసీ బంధువులను ప్రలోభపెడుతున్న టీడీపీ'

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీ బంధువులను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు.

నెల్లూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీ బంధువులను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఒక్కరు వస్తే చాలనీ అందరినీ అడుగుతున్నారని వెల్లడించారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.

నెల్లూరు కార్పొరేషన్ తరహాలోనే జిల్లా పరిషత్ ను గెల్చుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మండలాధ్యక్ష ఎన్నికల్లోనూ, నిన్న జరిగిన పురపాలక ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.

Advertisement
 
Advertisement
Advertisement