'ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తోంది' | tdp government blames the ysrcp says ambati rambabu | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తోంది'

Sep 3 2015 4:08 PM | Updated on May 29 2018 4:23 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు మండిపడ్డారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల  అరెస్టులే దీనికి నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి పట్ల అసభ్యంగా మాట్లాడిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement