అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి | students dies in a road accident in visakha | Sakshi
Sakshi News home page

అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి

Jan 27 2017 10:24 PM | Updated on Nov 9 2018 4:12 PM

అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి - Sakshi

అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి

అతివేగం ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది.

విశాఖపట్నం: అతివేగం ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన తిమ్మాపురం-రుషికొండ మధ్య దారిలో చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న నితిన్(18), విజయహాసిని(18) మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నితిన్‌ దువ్వాడ కాలేజిలో బీటెక్ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement