నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన | Sakshi
Sakshi News home page

నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Published Wed, Jan 27 2016 11:26 AM

నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

నాగార్జున యూనివర్సిటీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం బంద్ పాటిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా విద్యార్థి జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉద్యోగులను విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. 
 

Advertisement
Advertisement