డబ్బులు లేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య! | Students commit suicide due to financial problems in visakha district | Sakshi
Sakshi News home page

డబ్బులు లేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య!

Dec 10 2013 10:02 AM | Updated on Nov 9 2018 4:51 PM

విశాఖ జిల్లా లంకెలపాలెం రైల్వేగేటు వద్ద ఇద్దరి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

విశాఖ : విశాఖ జిల్లా లంకెలపాలెం రైల్వేగేటు వద్ద ఇద్దరి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు అనకాపల్లి జేఎంజే  స్కూలుకు చెందిన విద్యార్థులు జోగి, స్వరూప్లుగా పోలీసులు గుర్తించారు.  ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్లో డబ్బులు లేకనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా విద్యార్థులు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందని ముందుగా అనుకున్నప్పటికీ....సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యలుగా ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement