
(ఫైల్ ఫోటో)
శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో శనివారం కంప్యూటర్లు మొరాయించాయి.
సాక్షి, తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో శనివారం కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో గదులు కేటాయించే సీఆర్ఓ కార్యాలయంలో గంటకుపైగా కంప్యూటర్లు పని చేయలేదు. సర్వర్ డౌన్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గదులు కోసం గంటల తరబడి క్యూలైన్లో పడిగాపులు గాస్తున్నారు. కంప్యూటర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు.