కిరణ్‌తో సీమాంధ్ర నేతల భేటీ | Seemandhra Congress Leaders met Kiran kumar Reddy in Delhi | Sakshi
Sakshi News home page

కిరణ్‌తో సీమాంధ్ర నేతల భేటీ

Sep 4 2013 3:43 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్‌తో సీమాంధ్ర నేతల భేటీ - Sakshi

కిరణ్‌తో సీమాంధ్ర నేతల భేటీ

సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఢిల్లీలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని కలిశారు.

సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఢిల్లీలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని కలిశారు. ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం రాత్రి పదింటికి ఏపీభవన్‌కు వచ్చిన ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు వీరిలో ఉన్నారు. రాష్ట్ర విభజనపై మరింత ముందుకే తప్ప కేంద్రం వెనక్కు వెళ్లబోదనే స్పష్టమైన సంకేతాల నేపథ్యంలో భావి కార్యాచరణపై సమాలోచన జరిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement