చినుకు..చినుకు..వానగా మారినట్లు.. వాన వర దగా రూపొందినట్లు..వరద బీభత్సం సృష్టించినట్లు..వివిధ నిర్మాణాలలో ముఖ్య భూమిక పోషించే ఇసుకపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒకరికొకరుగా వంద లాది మంది ఏకమై భారీ ఎత్తున ఆందోళన బాట పట్టారు. భవన నిర్మాణ కార్మికులు, ఇసుక ట్రాక్టర్ల యజమానుల సంఘాలు, నాటు బళ్ల సంఘాలు, తాపీ పనివారలు, రాడ్ బెండర్లు, కర్రపనివారలు, విద్యుత్ కార్మికులు, ఇనుప బళ్ల యజమానులు, టైల్స్, మార్బుల్, ఫ్లోరింగ్ పనివారలు, లోడింగ్, అన్లోడింగ్ కూలీలు తదితర సంఘాలకు చెందిన వారు పార్వతీపురం పట్టణంలో కదం తొక్కారు.
పార్వతీపురం: సీపీఎం, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణం, మండలం, కొమరాడ, గరుగుబిల్లి తదితర మండలాలకు చెందిన వందలాది మంది తొలుత పాతబస్టాండ్ రాయగడ రోడ్డులోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం నుంచి పట్టణ మెయిన్ రోడ్డులో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్కు చేరుకుని రాస్తారోకో, ధర్నా, మానవహారం నిర్విహ ంచారు. నాలుగు రోడ్లను నిర్బంధించి కాంప్లెక్స్ నుంచి బస్సులు కదలకుండా, ఇరువైపులా వాహనాల రాకపోకలు సాగకుండా అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఆయా సంఘాలకు చెందిన నాయకులు రెడ్డి శ్రీరామమూర్తి, జివి సన్యాసి, పి.సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక రీచ్ల నిర్వహణ మహిళా సంఘాల పేరుతో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అప్పగించి, భరించలేని ధరలు పెట్టి ప్రజా కంటక నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఈ ప్రాంతంలో ఎవరూ ఇసుక కొనలేరని, భవన నిర్మాణాలు చేపట్టలేరని ఆందోళన వెలిబుచ్చారు. నిరుపేదలు ఇళ్లు కట్టుకోలేని దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కార్పొరేట్ స్థాయిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని, పేదల గురించి కూడా ఆలోచిస్తే అంతగా ధరలుండవని హితవు పలికారు. భవన నిర్మాణాలు లే కపోతే వాటిపై ఆధారపడిన వివిధ వృత్తి పనివారలు గత మూడు నెలలుగా పనులు లేక పస్తులుంటున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఇప్పటికే వేలాది మంది విశాఖ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పనులు వెదుక్కుంటూ వెళ్తున్నారన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రాంతమంతా ఖాళీ అవుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతి రేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సబ్-కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. తరువాత ఆ కార్యాలయం ఏఓ టి.రామకృష్ణారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సైలు బి.సురేంద్రనాయుడు, సాంబశివరావు తదితరులు తమ సిబ్బందితో పర్యవేక్షించారు. ధర్నా కార్యక్రమంలో కొత్తపోలమ్మ భవన నిర్మాణ కార్మిక సంఘం, సోమేశ్వర విజయదుర్గ, జగన్నాథ విజయదుర్గ ట్రాక్టర్ల యజమానుల సంఘాలు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు పార్వతీదేవి కార్పెంటర్ల సంఘం తదితర సంఘాలు పాల్గొన్నాయి.
ఇసుక దుమారం..!
Published Sun, Nov 2 2014 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement