కనకదుర్గమ్మను దర్శించుకున్న మోహన్‌ భగవత్‌

RSS Chief Mohan Bhagavat Visits Durgamma Temple - Sakshi

విజయవాడ:  నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని‌ ఆరెస్సెస్స్‌ ఛీఫ్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు ఈవో కోటేశ్వరమ్మ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, అమ్మవారి చీర ప్రసాదం, చిత్రపటం మోహన్‌ భగవత్‌కు అందచేశారు. విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోహన్ భగవత్ విజయవాడకి వచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top