పెద్ద మొత్తంలో గుట్కాల పట్టివేత | Rs.10 lakhs worth Gutka seized | Sakshi
Sakshi News home page

పెద్ద మొత్తంలో గుట్కాల పట్టివేత

May 18 2015 3:20 PM | Updated on Sep 26 2018 6:49 PM

విజయనగరం జిల్లా డెంకాడలో నిషేధిత ఖైనీలు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి.

డెంకాడ (విజయనగరం) : విజయనగరం జిల్లా డెంకాడలో నిషేధిత ఖైనీలు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. జిల్లా ఆహార భద్రతా అధికారి నందాజీ ఆధ్వర్యంలో.. మూసివేసిన ఓ రైస్ మిల్లు గోదాముపై సోమవారం ఉదయం దాడులు జరిగాయి. ఈ సందర్భంగా గోదాములో 200 బాక్సుల్లో నిల్వ చేసిన రాజా ఖైనీలు వెలుగు చూడగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక్కడ నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. రైస్ మిల్లు గోదామును నరసింహమూర్తి అనే వ్యక్తి మరో వ్యక్తికి లీజుకిచ్చినట్టు తెలియడంతో ఆ వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement