గాజువాక పైడిమాంబ కాలనీలో దొంగలు బీభత్సం | Sakshi
Sakshi News home page

గాజువాక పైడిమాంబ కాలనీలో దొంగలు బీభత్సం

Published Wed, May 20 2015 9:32 AM

Robbery in gajuwaka Pydimamba Colony, visakhapatnam

విశాఖపట్నం: విశాఖపట్నం గాజువాకలోని పైడిమాంబ కాలనీలో దోపిడి దొంగలు మంగళవారం అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. టైల్స్ వ్యాపారి ఇంట్లో చోరీ చేసి... 60 తులాల బంగారంతోపాటు రూ. 10 లక్షల నగదు అపహరించి పరారైయ్యారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం గమనించి సదరు టైల్స్ వ్యాపారి పోలీసులకు ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
Advertisement