వివాహ వేడుకకు వెళుతూ.. | Road accident in west godavari | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకకు వెళుతూ..

May 30 2015 1:20 AM | Updated on Aug 30 2018 3:58 PM

ద్వారకాతిరుమల : పెళ్లిబృందం ప్రయాణిస్తున్న ట్రక్ ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది గాయాలపాల య్యారు.

ద్వారకాతిరుమల : పెళ్లిబృందం ప్రయాణిస్తున్న ట్రక్ ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది గాయాలపాల య్యారు. వీరిలో 9 మందికి తీవ్ర గాయూలు కాగా మి గిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురం వద్ద గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన పెళ్లి బృందం సభ్యులు సుమారు 20 మంది గురువారం రాత్రి ఆటోలో బయలుదేరి ద్వారకాతిరుమల వెళ్తున్నారు.
 
 మార్గమధ్యలో సంఘటనా స్థలం వద్ద వీరి ఆటో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న సుద్దలోడు లారీని వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయూణిస్తున్న డ్రైవర్‌తో సహా 14 మందికి గాయూలయ్యూరుు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపు మార్జిన్‌లోకి తిప్పడంతో ఘెర ప్రమాదం తప్పింది. రెండు 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
 కొవ్వలికి చెందిన బళ్ల సత్యన్నారాయణకు కుడి కాలు, వడిగిన అనిల్‌కు ఎడమ కాలు విరిగింది. కె.ప్రసాద్, బొప్పన గణేష్, డి.గణేష్, డి.గంగరాజు, దెందులూరుకు చెందిన కె.అశోక్, వి.పవన్ మన్మధరావు, కేఎన్ పురానికి చెందిన బి.వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయూలయ్యూరుు. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని ఏలూరు వీఆర్ ఎస్సై కర్రి సతీష్‌కుమార్, స్థానిక పోలీస్ సిబ్బంది పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement