జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం నుంచి అదృశ్యమైన విద్యార్థులు ఆదివారం క్షేమంగా తిరిగొచ్చారు. వారిని రాజమండ్రి పోలీసులు తీసుకువచ్చి జంగారెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారు. ఈ నెల 21న కొండా గౌతమి, బి.ప్రేమలతలు కళాశాలకు అని చెప్పి బయలుదేరి అదృశ్యం కావడంతో వార్డెన్ స్వర్ణలత జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై పోలీసు అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థినులు తిరిగొచ్చారనే విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డీడీ శోభారాణి విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థినులు ఈ నెల 21న వసతిగృహం నుంచి కళాశాలకు వెళ్లి అదృశ్యమయ్యారన్నారు. ఆన్లైన్ స్కాలర్షిప్ల కోసం బ్యాంకు ఖాతాలు ఓపెన్చేయడానికి వెళ్లినట్టుగా విద్యార్థినులు చెబుతున్నారన్నారు. అయితే వసతిగృహం నుంచి బయలుదేరి కళాశాలకు హాజరుకాకుండా బ్యాంకుకు వెళ్లారని, కళాశాలకు హాజరుకాకపోవడంతో అధ్యాపకులు ఏమైనా అంటారేమోనని భయపడ్డామని తెలిపారన్నారు. అలాగే ఇదే విషయాన్ని తమ తల్లితండ్రులకు వార్డెన్ తెలియజేస్తానన్నారని, వారికి తెలిస్తే ఏమైనా అంటారేమోనన్న భయంతోనే తాము బయటకు వెళ్లిపోయామని విద్యార్థినులు చెబుతున్నారన్నారు. ఏసు అనే ఆటోడ్రైవర్ సహాయంతో ఆటోలో రాజమండ్రికి, అక్కడ నుంచి రైల్లో విజయవాడ, హైదరాబాద్ వెళ్లినట్టు పేర్కొంటున్నారన్నారు.
హైదరాబాద్లో విద్యార్థులు దిగగానే వారి వారి తల్లితండ్రులతో ఫోన్లో మాట్లాడామని, భయంతోనే హైదరాబాద్ వెళ్లామని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నామని తల్లితండ్రులతో చెప్పామని వారు చెప్పారని ఆమె తెలిపారు. తిరిగి విద్యార్థులు రాజమండ్రి రైల్లో వచ్చి, పోలీసుల సహాయంతో జంగారెడ్డిగూడెం చేరుకున్నారు. అలాగే ఈ విద్యార్థులను చైల్డ్ప్రొటెక్షన్ వారికి అప్పగించనున్నట్లు చెప్పారు. వారు అక్కడ విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ ఏసు వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు ఉన్నారని విచారణలో తేలిందని తెలిపారు. విద్యార్థినులు ఆటో ఎక్కడం, దిగడం వల్లే ఏసుతో పరిచయం ఏర్పడి ఉండి ఉంటుందని ఆమె అన్నారు. అయితే ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఆమె తెలిపారు.
తిరిగొచ్చిన హాస్టల్ విద్యార్థినులు
Published Mon, Nov 24 2014 12:27 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement