గంటా వర్గానికి ముకుతాడు | Responsibilities of charge to yanamala | Sakshi
Sakshi News home page

గంటా వర్గానికి ముకుతాడు

May 15 2015 1:32 AM | Updated on Sep 3 2017 2:02 AM

గంటా వర్గానికి   ముకుతాడు

గంటా వర్గానికి ముకుతాడు

గతేడాది అధికారుల బదిలీల సమయంలో జిల్లా మంత్రులపై వెల్లువెత్తున అవినీతి ఆరోపణలు రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.

యనమలకు ఇన్‌చార్జి బాధ్యతలు
మంత్రుల ఆదిపత్యానికి అడ్డుకట్ట
యనమలతో అయ్యన్నకు సాన్నిహిత్యం
గంటా వర్గానికి ప్రతికూల పరిణామం

 
విశాఖపట్నం :     గతేడాది అధికారుల బదిలీల సమయంలో జిల్లా మంత్రులపై వెల్లువెత్తున అవినీతి ఆరోపణలు రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి తలెత్తకుండా బదిలీల్లో స్థానిక మంత్రుల పెత్తనానికి చెక్ పెట్టేందుకు జిల్లాకో ఇన్‌చార్జి మంత్రిని నియమించింది. మన జిల్లాకు రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడ్ని నియమించడంతో జిల్లా మంత్రులకు చెక్ పడుతుందో లేక..ఆదిపత్యపోరు మరింత ఆజ్యం పోస్తుందోననే చర్చ పార్టీలో జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కేటాయించే ఏసీడీపీ, ఎస్‌డీఎఫ్, సీడీపీ వంటి నిధులను ఖర్చు చేసే విషయంలో పెత్తనం జిల్లా ఇన్‌చార్జి  సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు  వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి.


 అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement