ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన చిన్నకోడూరు మండలం మాచాపూర్లో జరిగింది.
చిన్నకోడూరు, న్యూస్లైన్ : ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన చిన్నకోడూరు మండలం మాచాపూర్లో జరిగింది. గ్రామస్తులు, కుటుం బీకులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ భర్త బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లగా ఆ మహిళ కూతురితో కలిసి గ్రామంలోనే ఉంటోంది. సోమవారం ఆ మిహ ళ పొలానికి వెళ్లింది. పనులు ముగించుకున్న అనంతరం బావివద్దకు వెళ్లగా అ దే గ్రామానికి చెందిన వివాహితుడు కో డూరి శంకర్ ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబీకులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడనీ, త్వరలోనే పట్టుకుని కోర్టులో ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు.
పోలీస్స్టేషన్ ఎదుట బాధిత కుటుంబీకుల ఆందోళన
వివాహితను అత్యాచారం చేసిన నిందితున్ని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటంబీకులు మంగళవారం చిన్నకోడూరు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
సిద్దిపేట, అల్లీపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిందితునిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితున్ని అరెస్టు చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్ అక్కడకు చేరుకుని వారిని బాధిత మహిళ కుటుంబీకులతో మాట్లాడారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన హామి ఇవ్వడంతో వారు శాంతించారు.