'కమీషన్ల కోసం కాలువ గట్లపై నిద్ర' | Sakshi
Sakshi News home page

'కమీషన్ల కోసం కాలువ గట్లపై నిద్ర'

Published Thu, Apr 23 2015 7:00 PM

ఎన్. రఘువీరారెడ్డి(ఫైల్) - Sakshi

అనంతపురం: కమీషన్ల కోసం కాలువ గట్లపై నిద్ర చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. రూ. 300 కోట్ల ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతున్నారని అన్నారు. పట్టిసీమకు బదులు పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీల అమలులో విఫలమయ్యారు.

Advertisement
Advertisement