తుదినిర్ణయం సభకే వదిలేసిన ప్రివిలేజ్‌ కమిటీ | Privilege committee submit report over ysrcp mla roja suspension to speaker | Sakshi
Sakshi News home page

తుదినిర్ణయం సభకే వదిలేసిన ప్రివిలేజ్‌ కమిటీ

Mar 16 2017 1:04 PM | Updated on Aug 18 2018 5:15 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్స్‌ చేసింది.

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్స్‌ చేసింది. అయితే సస్పెన్షన్‌ విషయంలో తుది నిర్ణయాన్ని సభకే వదిలిపెట్టినట్టు ప్రివిలేజ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు గురువారం  ప్రివిలేజ్ కమిటీ 62 పేజీల నివేదిక అందజేసింది. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా అనుచితంగా ప్రవర్తించారంటూ గతంలో ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు  స్పీకర్‌  సస్పెన్షన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్‌ డిసెంబర్‌లోనే ముగిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement