విజయనగరం కంటోన్మెంట్ / విజయనగరం రూరల్ : జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. స్థల పరిశీలన కోసం జిల్లాకొచ్చిన బృందం దాదాపు సానుకూలత చూపించింది. విజయనగరం మండలం గుంకలాంలోని స్థలం పట్ల బృందం మొగ్గు చూపింది. కేంద్రం ఆమోదిస్తే ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. గతం లో పాచిపెంట మండలంలో స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా లేదని తేల్చేశారు. దీంతో గిరిజన వర్సిటీ పక్కజిల్లా విశాఖకు తరలిపోనుందని అందరూ భావించారు. తాజాగా కొత్తవలస మండలం రెల్లి, విజయనగరం మండలం గుంకలాంలలో స్థలాన్ని పరిశీలించిన కేంద్రకమిటీ గుంకలాంవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది.
కేంద్రం నిధులిస్తే జేఎన్టీయూలో తాత్కాలికంగా గిరిజనవర్సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించడం మరింత నమ్మకం కలిగిస్తోంది. గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన కోసం కేంద్ర మానవ వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సుక్బీర్ సింగ్ సందు ఆధ్వర్యంలోని కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించింది. ఆయనతో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా జిల్లాకు రాగా వారికి రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ, కలెక్టర్ ఎంఎం నాయక్లు జిల్లాలోని స్థలాలను చూపిస్తూ అక్కడి పరిస్థితులు వివరించారు. తొలుత కొత్తవలస మండలం రెల్లిలో ఉన్న స్థలాలను పరిశీలించగా, మధ్యాహ్నం విజయనగరం మండలం గుంకలాం గ్రామ పరిధిలో ఉన్న స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
వారి తీరును చూస్తుంటే రెల్లి గ్రామం కన్నా గుంకలాంపైనే మక్కువ చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. తొలుత కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గిరిజన యూనివర్సిటీకి సరిపడా స్థలం ఉందని చూపించగా, దానిని పరిశీలించారు. ఇక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతముంది. 178.77 ఎకరాలు గుట్టలతో నిండిఉంది. మొత్తం 526.24 ఎకరాలను బృందం పరిశీలించింది. అనంతరం విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామ పరిసరాల్లో ఉన్న 347.63 ఎకరాల డి పట్టా భూములు, 163.78 ఎకరాల కొండపోరంబోకు, 29.33ఎకరాల బంజరు భూమి,4.23 ఎకరాల రస్తా భూములతో కలిపి 504.97 ఎకరాలను బృందం పరిశీలించింది. మొత్తం ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ తన పరిశీలన నివేదికను కేంద్రానికి అందించనుంది. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పరిశీలనలు చేసిన కేంద్ర బృందం ఎక్కువగా గుంకలాంకు ప్రాధాన్యం ఇనిచ్చినట్టు స్పష్టమవు తోంది.
కొత్తవలసలోని రెల్లిలో భూముల కన్నా గుంకలాంలోని భూములు గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్టు బృందం గుర్తించింది. కొత్తవలసలో ఉన్న భూములు ఎక్కువగా గుట్టలతో పాటు ఎక్కువగా ఏటవాలుగా ఉన్నాయి. అలాగే అక్కడి భూముల్లో నిర్మాణాలకు కోర్టు అనుమతులు కూడా అవసరముంది. దీనికి తోడు ఇక్కడ స్థలం ఎక్కువగా కొండ ప్రాంతం నిండిఉందని కేంద్ర బృందం వ్యాఖ్యానించినట్టు మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు. అలాగే గుంకలాం భూములు పరిశీలించిన ఈ ఐదుగురు సభ్యులున్న కమిటీ సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇక్కడున్న భూముల్లో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలూ లేకపోవడంతో పాటు జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉండటాన్ని కూడా సానుకూలంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదమే తరువాయి అన్న భావన అందరిలో కలుగుతోంది. మరో వైపు మంత్రి నారాయణ విలేకర్లతో మాట్లాడినప్పుడు గుంకలాంకే ప్రాధాన్యతనిచ్చారు.
జేఎన్టీయూలో తాత్కాలికంగా తరగతులు
జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని అంశాలూ సానుకూలంగా ఉండడంతో కేంద్రానికి నివేదించాక ఆమోదం లభించి నిధులు విడుదలైతే వచ్చే ఏడాది నుంచే గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. యూనివర్సిటీకి భవన సముదాయం నిర్మంచే వరకూ విజయనగరం పట్టణానికి సమీపంలో ఉన్న జేఎన్టీయూలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ఆమోదం లభిస్తే జేఎన్టీయూలో తాత్కాలికంగా యూనివర్సిటీని ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు ఈ విష యమై కూడా బృందం సభ్యులు జేఎన్టీయూ అధికారులను అడిగినట్టు చెబుతున్నారు. జేఎన్టీయూ అధికారులు కూడా తాత్కాలికంగా భవనాన్ని ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం.
గుంకలాంకే ఛాన్స్!
Published Wed, Feb 18 2015 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement