నేడు రాష్ట్రానికి పార్లమెంటరీ బృందం | Parliamentary team to become telangana state today | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రానికి పార్లమెంటరీ బృందం

May 26 2015 1:47 AM | Updated on Sep 3 2017 2:40 AM

ఎగుమతులకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.

సాక్షి, హైదరాబాద్: ఎగుమతులకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. 20 మంది ఎంపీల ఈ బృందం ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. ఈ బృందానికి సమర్పించాల్సిన వివరాలపై పరిశ్రమల శాఖ అధికారులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు వివరించారు. సనత్‌నగర్‌లోని ఇన్‌లాండ్ కంటెయినర్ డిపో, నాగులపల్లిలోని సీడబ్ల్యూసీ గోదాములు, కూకట్‌పల్లిలోని కంటెయినర్ రవాణా వ్యవస్థను ఈ బృందం పరిశీలిస్తుంది.

ఈ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధ వారం భేటీ అవుతుంది. రాష్ట్రానికి సముద్రమార్గం లేకపోవడంతో డ్రైపోర్టు ఏర్పాటుపై పరిశీలించాలన్న విజ్ఞప్తిని బృందం ముందు ఉంచే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement