లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్
సాక్షి, చెన్నై : తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్ ఆదివారం పరిశీలించారు.
తిరుమల లడ్డు ధర పెంచే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదు.
లడ్డు ప్రసాదం ధర పెంపు అని ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవాలు.— Y V Subba Reddy (@yvsubbareddymp) November 17, 2019
తిరుమల తిరుపతి దేవస్థానం, చెన్నై శ్రీ వెంకటేశ్వర టెంపుల్స్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షలు ఉపాధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. pic.twitter.com/BkIeN7yHaM
— Y V Subba Reddy (@yvsubbareddymp) November 17, 2019