బస్సు స్టీరింగ్ విరిగింది... పొలంలోకి దూసుకెళ్లింది | No injured in bus accident at guntur district | Sakshi
Sakshi News home page

బస్సు స్టీరింగ్ విరిగింది... పొలంలోకి దూసుకెళ్లింది

Dec 20 2014 11:03 AM | Updated on Aug 20 2018 3:26 PM

బస్సు స్టీరింగ్ విరిగింది... పొలంలోకి దూసుకెళ్లింది - Sakshi

బస్సు స్టీరింగ్ విరిగింది... పొలంలోకి దూసుకెళ్లింది

గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. శనివారం సత్తెనపల్లి నుంచి అమరావతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేతిలోని స్టీరింగ్ అకస్మాత్తుగా విరిగింది.

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.  శనివారం సత్తెనపల్లి నుంచి అమరావతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేతిలోని స్టీరింగ్ అకస్మాత్తుగా విరిగింది. దాంతో బస్సు డ్రైవర్ సడన్ బ్రేకు వేశారు. వేగంగా వెళ్తున్న బస్సు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకు పోయి.. పొలం గట్టును ఢీ కొట్టి ఆగింది.

అప్పటికే తీవ్ర భయాందోళనతో బిగ్గరగా కేకలు వేస్తున్న ప్రయాణికులు బస్సు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement