రూ. 260 కోట్లు ఇస్తే నిజాం షుగర్స్ అప్పగిస్తాం! | Nizam sugars will hand over, if 260 crors give to Delta Papers Company | Sakshi
Sakshi News home page

రూ. 260 కోట్లు ఇస్తే నిజాం షుగర్స్ అప్పగిస్తాం!

Jan 18 2014 4:30 AM | Updated on Sep 2 2017 2:43 AM

తమకు రూ.260 కోట్లు చెల్లిస్తే నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్స్‌ను ఇచ్చేందుకు సిద్ధమని మంత్రివర్గ ఉప సంఘానికి డెల్టా పేపర్స్ కంపెనీ స్పష్టంచేసినట్టు తెలిసింది.

సాక్షి, హైదరాబాద్: తమకు రూ.260 కోట్లు చెల్లిస్తే నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్స్‌ను ఇచ్చేందుకు సిద్ధమని మంత్రివర్గ ఉప సంఘానికి డెల్టా పేపర్స్ కంపెనీ స్పష్టంచేసినట్టు తెలిసింది. నిజాం షుగర్స్ కర్మాగారంపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి తదితరులతో ఏర్పా టైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. కర్మాగారం అప్పగింతపై తమకు నివేదిక ఇవ్వాలని కంపెనీని ఉపసంఘం ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement